టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా పరిచయం అయ్యారు.  అక్కినేని, మెగా, నందమూరి, మంచు ఫ్యామిలీ నుంచి హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.  మరికొంత మంది చిన్న చిన్న పాత్రలు వేస్తూ స్వయం కృషితో పైకి వచ్చిన హీరోలు కూడా ఉన్నారు.  టాలీవుడ్ లో  మైత్రి మూవీ మేకర్స్ ఎన్నో హిట్ సినిమాలు అందించారు.  గత యేడాది సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’మంచి హిట్ అయ్యింది.  ఆ తర్వాత వరుసగా డిజాస్టర్లు మూటగట్టుకుంటూ వచ్చింది. 
Related image
'సవ్యసాచి' సినిమా ఫ్లాప్ అయిన తరువాత 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమాతో మైత్రి వారికి అనుకోని దెబ్బ తగిలింది. కానీ ఈ సంస్థ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాలు నిర్మిస్తూనే ఉంది. ఇప్పటికే సాయిధరమ్తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమా షూటింగ్ కూడా పూర్తయింది.  అంతే కాదు మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్  పరిచయం చేస్తూ తెరకెక్కనున్న సినిమా కూడా మొదలైంది. 
Related image
ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి రెండో తనయుడు సింహ కోడూరి ని హీరోగా రితీష్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రి సంస్థ ఒక సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయింది. ఈ సినిమాకు 'మత్తు వదలరా' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ త్వరగా పూర్తిచేసి సెప్టెంబర్లో విడుదలకు సిద్ధం చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: