బుల్లితెర యాంకర్లలో మంచి క్రేజ్ మరియు ఫాలోయింగ్ సంపాదించిన యాంకర్లలో అనసూయ అగ్రభాగాన నిలుస్తారు అని చెప్పవచ్చు. ఇక ఇటీవల రంగస్థలం సినిమాలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్ర, ఒక్కసారిగా ఆమె క్రేజ్ ను మరింత పెంచింది. ఇకపోతే ఎప్పటికప్పుడు తన షూటింగ్ అప్ డేట్స్ మరియు ఫ్యామిలీ విషయాలను ఎప్పటికపుడు అనసూయ త సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన ఫ్యాన్స్ తో పంచుకుంటుంటారు అనసూయ.

అలానే ఇటీవల ఆమె కాశ్మీర్ లోని పుల్వామాలో మన దేశ సైనిక సోదరులపై జరిగిన దాడిని ఖండిస్తూ తన ట్విట్టర్ ద్వారా వారికి నివాళి అర్పిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఆ పోస్ట్ పై కొందరు నెటీజన్స్ స్పందిస్తూ, ఇంకెందుకు ఆలస్యం, వెళ్లి పొట్టి పొట్టి దుస్తులు వేసుకుని షోలు చేసుకో పో, అంటూ ఆమెపై కామెంట్స్ చేశారు. ఇక నేడు వాటిని ఖండిస్తూ అనసూయ ఒక వీడియో పోస్ట్ చేసారు. 


నిజానికి ఎక్కువమంది ప్రతి విషయం నా దుస్తులతో ఎందుకు ముడిపెడుతున్నారో తనకు అర్ధం కావడం లేదని, అయినా ఆ రోజు నేను కూడా ఎంతో బాధతో చనిపోయినవారికి నివాళిగా పోస్ట్ పెట్టాను, అందులో తప్పేముందని ప్రశ్నించారు. మీరు కూడా ఏదో అందరిలానే వారికి సంతాపంగా ఒక పోస్ట్ చేసి, ఆపై హాయిగా బిరియాని తినడం లేదా? అయినా మీకు నిజంగా దేశభక్తి ఉంటే, కాశ్మీర్ వెళ్లి ధైర్యంగా మన దేశం తరపున యుద్ధం చేయండి, అంతేకాని నామీద అసభ్యకర ట్వీట్స్ మాత్రం చేయవద్దు అంటూ హెచ్చరించారు. కాగా అనసూయ చేసిన వీడియో పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది


మరింత సమాచారం తెలుసుకోండి: