సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఓ సంచలనం, బతికి ఉండగా ఆయన న్యూసే, మరణమూ ఓ సంచలనమే. నడుస్తొన్న చరిత్రలో ప్రతి సందర్భంలో రామారావు  ప్రస్తావన వచ్చినపుడల్లా అది ఓ సెన్సేషనల్ న్యూసే అవుతుంది. అటువంటి అన్న గారి జీవితంలో చీకటి కోణాలు కొన్ని లోకానికి తెలుసు. మరి కొన్ని తెలియదు. అయితే రామారావు విషయంలో ఆయన ఒకసారి కాదు ఎన్నో సార్లు వెన్నుపోట్లకు గురి అయ్యారని అంటారు ఆయన సన్నిహితులు. అది కూడా అయిన వాళ్ళు, రక్త సంబంధీకులే ఆయన్ని వంచించారని చెబుతారు.


సీనియర్ పాత్రికేయుడు  సీనియర్ ఎన్టీఆర్ తో అనుబంధం ఉన్న తిప్పరాజు రమేశ్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా  జిల్లాకు నిమ్మకూరు సమీప గ్రామానికి చెందిన ఈయన ఎన్టీఆర్ కు సన్నిహితుడు. ఈ సందర్భంగా ఆయన ఓ యూట్యూబ్ చానెల్ తో సంచలన విషయాలు పంచుకున్నారు. రామారావు లాంటి వ్యక్తి కధానాయుకుడు కాదు, మహా నాయకుడు కాదు, ఆయన మహానుభావుడు అంటూ గతాన్ని చెప్పుకొచ్చారు.


ఎన్టీఆర్ అస్తులను, ఆశయాలను కాపాడలేని వారు ఆయన సంతానం అంటూ సంచలన కామెంట్స్ చేశారు. మద్రాస్ లో రామారావు నివసించిన ఇంటిని అమ్మకానికి పెట్టారని ఆయన విచారం వ్యక్తం చేశారు. అన్న గారిని సొంత కుటుంబీకులే వెన్నుపోటు పెడిచారని, అంతకంటే దారుణం ఆయన జీవిత కధను సినిమా గా తీసి కుమారుడు బాలక్రిష్ణ రోడ్డున పడవేశారని రమేష్ బాబు ద్వజమెత్తారు.  ఎన్టీఆర్ కి కనీసం అన్నం పెడితే ఆయన రెండవ పెళ్ళి గా లక్ష్మీ పార్వతిని చేసుకునే వారు కాదని ఆయన అన్నారు.


 తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి స్థాపించారని, నాదెండ్ల భాస్కర రావు వంటి వారు తామే పార్టీ పెట్టామని చెబితే అది అబద్దమని కూడా రమేష్ బాబు అన్నారు. రామారావు జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయని ఆయన అంటూ వాటిని రాం గోపాల వర్మ లక్ష్మీస్  ఎన్టీఆర్ మూవీస్ లో చూపిస్తారనే అనుకుంటున్నామని ఆయన అన్నారు. మొత్తం మీద చూసుకుంటే రమేష్ బాబు చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: