పాతకాలంలో ఓ సామెత ఉంది..ఎలుకల్ని చంపడానికి ఇల్లు కాల్చాడట ఓ ప్రబుద్దుడు.  ఇప్పుడు ఇలాంటి తంతే బాలీవుడ్ నటీమణి చేసింది..ఆ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  వివరాల్లోకి వెళితే..బాలీవుడ్ లో పలు హిందీ సీరియల్స్ లో నటించిన మంచి పేరు తెచ్చుకున్న టివి నటి  సౌమ్య టాండన్ తన బెడ్ రూమ్ లో దోమలను పారదోలేందుకు మస్కిటో రిపెల్లెంట్ ఆన్ చేసి అలాగే నిద్రపోయింది. ఆ రిపెల్లెంట్ లో మంటలు చెలరేగడంతో కొద్ది వ్యవధిలోనే ఇంట్లో మంటలు చెలరేగాయి.
Image result for saumya tandon
అది కాస్త తన బెడ్ రూమ్ మొత్తం మంటలు వ్యాపించాయి..వెంటనే తేరుకొని తన బామ్మతో అక్కడ నుంచి తప్పించుకొని అతి కష్టం మీద మంటలు ఆర్పి వేశారు.  అయితే ఆ మంటలు ఎలా వచ్చాయని ఆలోచిస్తే..మస్కిటో రిపెల్లెంట్ ఆన్ చేసి మర్చిపోవడం వల్లే అని తేలింది. మొత్తానికి పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. ఈ ఘటనలో సదరు టీవీ నటి ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడింది.
Image result for saumya tandon
భాబీజీ ఘర్ పర్ హై అనే సీరియల్ తో ఉత్తరాది రాష్ట్రాల్లో సౌమ్య టాండన్ ఎంతో క్రేజ్ తెచ్చుకుంది.  అయితే ఈ ప్రమాదం వల్ల తాను ఓ గుణపాఠం నేర్చుకున్నానని..ఇలాంటి ఎలక్ట్రిక్ వస్తువులు బెడ్ పక్కన పెట్టుకొని ఆదమరిచి నిద్రపోకూడదని.., లూజ్ కనెక్షన్ ఉన్న వస్తువులను ఎప్పుడూ ప్లగ్ చేయకూడదని, అగ్నిమాపక ఉపకరణాలను ఎల్లవేళలా ఇంట్లో ఉంచుకోవాలని..ప్రమాదం అని తెలియగానే చాలా అలర్ట్ గా ఉండి ప్రమాదం నుంచి తప్పించుకోవాలని సోషల్ మీడియాలో వెల్లడించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: