ప్రేక్షకులు నచ్చే సినిమా ఇవ్వడంతో పాటుగా వారికి ఎలాంటి సినిమా కావాలో.. ఎలాంటి కాస్టింగ్ ఆశిస్తారో బాగా తెలిసిన బ్యానర్ గీతా ఆర్ట్స్. బ్యానర్ ఎక్స్ పీరియన్స్ ను బట్టి ఈ విషయాలన్ని అర్ధమవుతాయి. తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించిన యాక్టర్ లేదా యాక్ట్రెస్ పై గీతా ఆర్ట్స్ కన్ను ఎప్పుడూ ఉంటుంది.


గీతా గోవిందం సినిమాతో గీతగా అలరించిన రష్మిక మందన్న తెలుగులో ఆమె క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. అందం అభినయంతో రష్మిక ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న రష్మిక మళ్లీ గీతా ఆర్ట్స్ లో ఒక సినిమాకు సైన్ చేసిందని తెలుస్తుంది. మారుతి డైరక్షన్ లో సాయి ధరం తేజ్ హీరోగా అల్లు అరవింద్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.


మారుతి డైరక్షన్ లో గీతా ఆర్ట్స్ ఇదవరకు తీసిన భలే భలే మగాడివోయ్ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. నానిని నాచురల్ స్టార్ చేసిన ఆ సినిమా తర్వాత మారుతి మళ్లీ గీతా ఆర్ట్స్ తో సినిమా చేయలేదు. ఫైనల్ గా మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాలో రష్మిక నటించడం సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుంది.


ప్రస్తుతం సాయి ధరం తేజ్ కిశోర్ తిరుమల డైరక్షన్ లో చిత్రలహరి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే మారుతి సినిమా పట్టాలెక్కుతుందట. వరుస ఫ్లాపుల్లో ఉన్న సాయి ధరం తేజ్ ఇక నుండి కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి చిత్రలహరి, మారుతి సినిమాలు తేజూ కెరియర్ ను ఎలా టర్న్ చేస్తాయో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: