ఒక భారీ డిజాస్టర్ తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను ఫేట్ ఎలా మారిందో తెలిస్తే షాక్ అవుతారు. భద్ర సినిమా నుండి వినయ విధేయ రామ వరకు బోయపాటి సినిమా అంటే ఓ బ్రాండ్ అన్నట్టుగా ఉండేది. కాని రాం చరణ్ వినయ విధేయ రామ ఇచ్చిన షాక్ తో బోయపాటి అంటేనే భయపడేలా చేశాడు. 


వినయ విధేయ రామ సినిమా ఫలితం అటుంచితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు బోయపాటికి బ్యాడ్ నేం తీసుకొచ్చాయి. నిర్మాత డివివి దానయ్యతో బోయపాటి గొడవ బోయపాటి మీద నెగటివ్ ఇంప్రెషన్ కలిగేలా చేశాయి. అందుకే అతనితో సినిమా అని ఇదవరకు అడ్వాన్సులు ఇచ్చిన వారు కూడా చిన్నగా సైడ్ అవుతున్నారట.


మైత్రి మూవీ మేకర్స్ కూడా బోయపాటి శ్రీనుతో సినిమా చేయాలని ముందే అడ్వాన్స్ ఇచ్చారు. అయితే వివిఆర్ సినిమా ఫలితం తర్వాత మా సినిమా పరిస్థితి ఏంటని అడగ్గా బోయపాటి శ్రీను వారి అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసినట్టు తెలుస్తుంది. ఇక సరైనోడు టైంలో గీతా ఆర్ట్స్ లో బోయపాటి మరో సినిమా ఉంటుందని అన్నారు. 


అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం అయ్యే పని కాదని తెలుస్తుంది. బోయపాటి కెరియర్ లో దమ్ము సినిమా ఫ్లాప్ అయినా అతని మీద అంతగా ఎఫెక్ట్ పడలేదు. కాని వినయ విధేయ రామ మాత్రం బోయపాటి ఇమేజ్ కు బాగా డ్యామేజ్ ఏర్పరచింది. ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా ఉంటుందని తెలుస్తుండగా అదైనా ఉంటుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: