టాలీవుడ్, బాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది సంచలనమే అవుతుంది. ఒకప్పుడు తన సినిమాలతో ఎంట్రటైన్ చేసినా..కొంత కాలం తర్వాత అదే మూస పద్దతి కొనసాగించడంతో ఆడియన్స్ వర్మ మూవీస్ ని తిరస్కరిస్తూ వచ్చారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. అక్కినేని నాగార్జున తో ‘ఆఫీసర్’సినిమా చేసి దారుణమైన డిజాస్టర్ పొందాడు.
ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో శివ సినిమాతో ట్రెండ్ సృష్టించిన ఈ కాంబినేషన్ ‘ఆఫీసర్’తో దారుణంమైన అపజయాన్ని చవిచూశారు. ప్రస్తుతం వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నందమూరి తారకరామారావు జీవితాన్ని లక్ష్మీ పార్వతి దృష్టి కోణంలో చూపించనున్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ రాజకీయ జీవితంతో పాటు లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలన్నింటిని కళ్ళకు కట్టినట్టు చూపించనున్నాడట.
ఈ సినిమాకు సంబంధించి ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్కి భారీ ఆదరణ లబించడంతో చిత్రం కూడా మంచి హిట్ అవుతుందని టీం భావిస్తుంది. మార్చి 15న విడుదల చేయాలని అనుకుంటున్నారట. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ మద్య క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఎన్టీఆర్ బయోపక్ నుంచి వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే.
దాంతో ఇప్పడు లక్ష్మీస్ ఎన్టీఆర్పై అభిమానులలో భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ సినిమాలో యజ్ఞాశెట్టి ‘లక్ష్మీపార్వతి’ పాత్రలో నటిస్తోండగా, ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు నటిస్తున్నాడు . ఇక చంద్రబాబు పాత్రలో వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ నటిస్తున్నారు.