టాలీవుడ్ లో మాస్ మహరాజ గా పేరు తెచ్చుకున్న రవితేజకి బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లే ఉంది. పవర్ సినిమా తర్వాత వచ్చిన బెంగాల్ టైగర్, కిక్ 2 డిజాస్టర్ అయ్యాయి. దాంతో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్ ' తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అదే ఊపులో టచ్ చేసి చూడు, నేల టిక్కెట్ సినిమాల్లో నటించాడు..కానీ ఈ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇటీవల శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంథోని సినిమాలో నటించాడు..ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. దాంతో రవితేజ కెరీర్ కష్టాల్లో పడ్డటే అనే టాక్ వచ్చింది.
ఈ నేపథ్యంలో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’సినిమాల దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ డిస్కోరాజా అనే మూవీ చేసేందుకు సిద్ధమయిన సంగతి తెలిసిందే. రవితేజ బర్త్డే సందర్భంగా చిత్ర టైటిల్ లోగో విడుదల చేశారు. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. చిత్రంలో ముగ్గురు కథానాయికలకు చోటుండగా ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేశ్ను ఓ నాయికగా, ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్పుత్ను మరో నాయికగా ఎంపిక చేశారు. మూడో నాయికను త్వరలో ఎంపిక చేయనున్నారు.
అయితే ఈ సినిమాకు మరో కొత్త ఇబ్బంది వచ్చినట్లు సమాచారం. ఆల్రెడీ సెట్స్ పై వున్న ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా కథకి .. ఈ కథకి కొన్ని దగ్గర పోలికలు వున్నాయట. ఈ విషయం రవితేజ దృష్టికి రావడంతో, తమ కథలో ఆ పోలికలు ఎక్కడా కనిపించకుండగా మార్పులు చేయమని వీఐ ఆనంద్ కి చెప్పినట్టుగా సమాచారం.
ప్రస్తుతం స్క్రిప్ట్ మార్చే పనిలో ఉన్నారట. వెన్నెల కిషోర్, సునీల్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ మూవీకి ఎస్.ఎస్. తమన్ స్వరకర్త. అయితే ఈ సినిమా కొంత భాగం చెన్నై నేపథ్యంలో సాగనున్ననేపథ్యంలో తమిళ స్టార్ బాబీ సింహాని ప్రతి నాయకుడిగా ఎంపిక చేశారని తెలుస్తుంది. కథలో మార్పులు చేసిన తరువాత షూటింగ్ను ప్రారంభించాలని రవితేజ చెప్పాడట. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.