క్రేజ్ ఉన్న ప్రాజెక్టుకు విడుదలకు ముందే శాటిలైట్, డిజిటల్ లాంటి వ్యవహారాలన్నీ లాక్ అయిపోతున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' నిర్మితమవుతోంది. నిధి అగర్వాల్ .. నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.  టెంపర్ తర్వాత వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఒకప్పుడు స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన పూరి ఈసారి అన్ని విషయాల్లో శ్రద్ద వహిస్తూ ‘ఇస్మార్ట్ శంకర్’సినిమాపై దృష్టిపెట్టారు. 

 నేను శైలజ సినిమా తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ కి కూడా ఏ సినిమా కలిసి రాలేదు.  దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే  'ఇస్మార్ట్ శంకర్' మంచి హిట్ కావాలనే కసి మీద ఉన్నారు.  తాజాగా  ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం కొన్ని టీవీ చానల్స్ వారు మేకర్స్ ను సంప్రదించారట.  10 కోట్ల రూపాయలిస్తేనే శాటిలైట్ రైట్స్ ఇస్తామంటూ బేరం పెట్టారట మేకర్స్. నిజానికి అటు పూరి జగన్నాధ్ కు, ఇటు రామ్ కు అంత మార్కెట్ లేదు. 

కొంత కాలంగా ఇద్దరూ ఫ్లాపుల్లోనే ఉన్న విషయం తెలిసిందే.. ఇలాంటి టైమ్ లో ఇస్మార్ట్ శంకర్ కు ఇంత రేటు చెప్పి బెదరగొట్టడం ఏంటని కామెంట్స్ చేస్తున్నాయి ఛానెళ్లు. మేకర్స్ చెబుతున్న 10 కోట్ల ఆఫర్ కేవలం శాటిలైట్ కు మాత్రమేనట. డిజిటల్ కోసం వాళ్లు మరో రేటు ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనక స్రవంతి రవికిషోర్ ఉన్నట్టు తెలుస్తోంది. చార్మితో కలిసి ఆయన ఈ డీలింగ్స్ అన్నీ చూస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాకి ఈ స్థాయి రేటు చెప్పడం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: