టాలీవుడ్ లో కొంత కాలంగా మాలీవుడ్ భామల హవా బాగా పెరిగిపోయింది. నయనతార నుంచి ఇప్పటి సాయి పల్లవి వరకు ఎంతో మంది హీరోయిన్లు మాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ లోకి వస్తున్నారు. లక్కీగా వారికి హిట్ సినిమాలు కలిసి రావడంతో స్టార్ హీరోయిన్ హోదాలోకి వెళ్తున్నారు. నేను శైలజ, నేను లోకల్, మహానటి సినిమాలతో కీర్తి సురేష్ తెలుగు, తమిళంలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘ఫిదా’సినిమాతో అచ్చమైన తెలంగాణ అమ్మాయిలా అందరి మనసు దోచింది సాయి పల్లవి.
ప్రస్తుతం సాయి పల్లవి తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో నటిస్తుంది. నటన పరంగానే కాదు డ్యాన్స్ కూడా దుమ్ముదులుపుతుంది. స్వతహాగా సాయి పల్లవి డ్యాన్సర్ కావడం విశేషం. అలాంటి సాయిపల్లవికి పూజా కన్నన్ అనే చెల్లి ఉందనే సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె సోదరి కూడా సినిమాల్లోకి అడుగు పెడుతుందని వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే ధనుశ్, పూజా కన్నన్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ధనుశ్ జోడీగా తొలి సినిమా చేస్తోందనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని..షూటింగ్ స్పాట్ లో ఉండగా దనుష్ తో ఓ సెల్ఫీ మాత్రమే తీసుకుందని..ప్రస్తుతం కన్నన్ మెడిసన్ చదువుతుందని..దువుపైనే పూర్తి దృష్టి పెట్టిందనీ, నటనవైపుకు వచ్చే ఉద్దేశం ఆమెకి లేదని అంటున్నారు. ఇక పూజా కన్నన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందనే ప్రచారానికి తెరపడిపోయింది.