బాలీవుడ్ లో స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా వస్తున్నారు. బాలీవుడ్ లో స్టారో హోదాలో ఉన్న కపూర్ ఫ్యామిలీ నుంచి మొదటి సారిగా హీరోయిన్లుగా అడుగు పెట్టారు కరీనా కపూర్, కరిష్మా కపూర్. బాలీవుడ్ హీరో రణదీర్ కపూర్ కూతుళ్లు అయిన వీరిద్దరిలో కరిష్మా కపూర్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే కరీనా కపూర్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. మొదటి సినిమా పెద్దగా ఫలితం రాకున్నా తర్వాత నటించిన సినిమాలు వరుస విజయాలు అందుకున్నాయి.
ప్రస్తుతం కరీనా కపూర్ హీరో సైఫ్ అలీ ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. వివాహం అయిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్న కరీనా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆ సమయంలో యాంకర్ అడిగిన ఓ కొంటె ప్రశ్నకు దిమ్మతిరిగే సమాదానం ఇచ్చింది.
మీరు ఎవరితో డేట్ కి వెళ్లాలనుకుంటున్నారా..అనే ప్రశ్నకు కరీనా 'రాహుల్ గాంధీ' అని టక్కున బదులిచ్చింది. ఈ ప్రశ్నకి నేను ఈ సమాధానం చెప్పొచ్చో.. లేదో తెలియదు కానీ చెబుతాను అంటూ రాహుల్ పేరు చెప్పింది. అతడి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుందని వెల్లడించింది. నేను పూర్తిగా సినీ కుటుంబానికి చెందిన ఫ్యామిలీ నుంచి వచ్చాను..రాజకీయ కుటుంబానికి చెందిన రాహుల్ తో చర్చ ఆసక్తికరంగా ఉంటుందేమోనని చెప్పింది.