సూపర్ స్టార్ మహేష్ మహర్షి తర్వాత సుకుమార్ తో సినిమా చేస్తాడని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుందని ఎనౌన్స్ చేశారు. అయితే కథ విషయంలో మహేష్, సుకుమార్ ఇద్దరు ఓ నిర్ణయానికి రాకపోవడంతో సినిమా క్యాన్సిల్ చేసుకున్నారు. సోమవారం అఫిషియల్ గా మహేష్ బాబు సుకుమార్ తో సినిమా క్యాన్సిల్ అయినట్టు చెప్పాడు.


మహేష్ కోసం శేషాచల అడవుల నేపథ్యంలో సాగే బందిపోటు కథ చెప్పాడు సుకుమార్. లైన్ బాగున్నా కథను నడిపించిన విధానం మహేష్ ను కన్విన్స్ చేయలేకపోయాడు సుకుమార్. అందుకే క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల సినిమా ఆగిపోయిందని మహేష్ స్వయంగా ప్రకటించాడు. మహేష్ తో ఆల్రెడీ 1 నేనొక్కడినే సినిమా చేసిన సుకుమార్ ఆ సినిమాతో అంచనాలను అందుకోలేదు.


భారీ బడ్జెట్ తో వచ్చిన 1 నేనొక్కడినే సినిమా మహేష్ కెరియర్ లో మంచి సినిమాగా నిలిచింది. అయితే మహేష్ తో చేయాల్సిన ఆ కథను బన్నితో ఎనౌన్స్ చేశాడు సుకుమార్. ప్రస్తుతం త్రివిక్రం తో అల్లు అర్జున్ 19వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే సుకుమార్ సినిమా లైన్ లోకి వస్తుందట.


సుకుమార్ మీద పూర్తి నమ్మకం ఉన్న బన్ని ఆయన చెప్పిన కథను ఓకే చేశాడు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో ఆర్య వస్తుంది అనుకుంటే ఈసారి ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ వస్తుందని తెలుస్తుంది. మరి సుకుమార్, బన్ని ప్రాజెక్ట్ ఎలా వస్తుందో చూడాలి. మహేష్ మాత్రం సుకుమార్ ను కాదని అనీల్ రావిపుడితో సినిమా చేయాలని చూస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: