సాయిపల్లవి అంటే చాలు ఫిదా అయిపోవడం యూత్ వంతు. ఆమె గ్లామర్ అంతా నాచురల్ గా ఉంటుంది. ఆమె అందమంతా ఆమె నటనలోనే ఉంటుంది. పక్కింటి అమ్మాయిలా ఉండే సాయిపల్లవిని మెచ్చుకోకుండా ఉండేదెవరు. ఇక వ్యక్తిగతంగానూ ఎటువంటి రూమర్లకు అవకాశం ఇవ్వని లైఫ్ ఆమెది. ఓ పద్ధతి ప్రకారం సినిమాల్లో నటిస్తూ తన కెరీర్ ని తీర్చిదిద్దుకుంటున్న ముద్దు గుమ్మ సాయి పల్లవి.


మహేష్ అంటేనే సూపర్ స్టార్. ఆయనతో నటించాలని ప్రతి హీరోయిన్ గోల్ పెట్టుకుంటుంది. మహేష్ పక్కన చాన్స్ అంటే లక్కును తొక్కినట్లేనని అంతా భావిస్తారు. అటువంటి మహేష్ మూవీలో చాన్స్ వస్తే సాయి పల్లవి నో చెప్పేసిందంట. ఈ న్యూస్ ఇపుడు టాలీవుడ్లో తెగ వైరల్ అవుతోంది.


దిల్ రాజు నిర్మాత‌గా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ తో మూవీ త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది.. ఈ నేప‌థ్యంలో దిల్ రాజు బ్యాన‌ర్ లో ఫిదా, ఎంసిఎ మూవీల‌లో న‌టించిన సాయి ప‌ల్ల‌విని మ‌హేష్ స‌ర‌స‌న న‌టింపజేసేందుకు దిల్ రాజు ద‌ర్శ‌కుడు అనిల్ తో సంప్ర‌దింపులు జ‌రిపాడు.అయితే ఈ మూవీలో హీరో వెంట మాత్ర‌మే తిరిగే పాత్ర కావ‌డం, పాత్ర‌కు ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంతో ఏ మాత్రం సంకోచించ‌కుండా నో చెప్పేసింది.


పాత్ర‌ న‌చ్చితే హీరో ఎవ‌ర‌నే విష‌యం తాను పట్టించుకోన‌ని, ఈ మూవీలో హీరోయిన్ పాత్ర‌కు అంత ప్రాధాన్య‌త లేకపోవ‌డంతోనే న‌టించ‌లేన‌ని సున్నితంగా అనిల్ రావిపూడికి సాయి ప‌ల్ల‌వి చెప్పింది. మొత్తానికి తాను ముందే చెప్పినట్లుగా సెలెక్టివ్ గానే మూవీస్ చేయడం, తన పాత్ర ఇంపార్టంట్ చూసుకోవడం విషయంలో సాయి పల్లవి ఎక్కడా రాజీ పడడంలేదుగా


మరింత సమాచారం తెలుసుకోండి: