మూవీ ఆర్టిస్టుల సంఘం ( మా ) ఎన్నికలు రెపు జరగబోతున్నాయి. నాలుగేళ్ల క్రితం నాటి హడావుడి ఈసారి కూడా కనిపిస్తోంది. అప్పట్లో ఓ వైపు రాజేంద్రప్రసాద్ ప్యానల్, మరో వైపు జయసుధ ప్యానల్ ఉన్నాయి. ఈ రెండు ప్యానళ్ళ మధ్య హోరా హోరీ జరిగింది. దాంతో ఉత్కంఠను రేపేలా ఎన్నికలు జరిగాయి. చివరికి మంచి మెజారిటీతో రాజేంద్రప్రసాద్ ప్యానల్ గెలిచింది. ఈసారి కూడా అలాగే హడావుడి జరిగుతోంది. మా పీఠం కోసం ఓ వైపు ప్రెజంట్ ప్రెసిడెంట్ శివాజీ రాజా, మరో వైపు సీనియర్ హీరో నరేష్ పోటీ పడుతున్నారు. దాంతో ఎవరు విన్నర్ అన్నది ఆసక్తిగా మారింది.


అయితే మా ఎన్నికల్లో గాలి మాత్రం నరేష్ ప్యానల్ వైపే ఉన్నట్లుగా చెబుతున్నారు. నరేష్ టీం ని మెజారిటీ సభ్యులు సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక నరేష్ వెనక సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రిష్ణ, జయసుధలతో పాటు, నందమూరి బాలక్రిష్ణ, మోహన్ బాబు  వంటి హేమాహేమీలు ఉంటున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు శివాజీ రాజా రెండవ మారు పోటీ చేయడం పట్ల పలువురు అనాసక్తిగా ఉన్నారని టాక్.


ఇక నరేష్ ప్యానల్ గెలుపు ఖాయంగా కనిపించడంతోనే మెగా క్యాంప్ కూడా ఆ ప్యానల్ కి సపోర్ట్ చేస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు మెగా బ్రదర్ నాగబాబు ఓపేన్ గా నరేష్ ప్యానల్ విజయాం ఖాయమని చెప్పడం కూడా వారి విక్టరీని తెలియచేస్తోందని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే రెండవ మారు గెలవాలని శివాజీ రాజా చేసిన ప్రయంత్నాలు ఫలించేలా లేవని అంటున్నారు. చూడాలి కొద్ది గంటల్లో ఫలితం ఏంటో తేలిపోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: