సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ అందగాడు. ఆయన నాలుగున్నర  పదుల వయసులోనూ టీనేజ్ అమ్మాయిలకు క్రేజీగానే ఉంటున్నాడు. మహేష్ తన కెరీర్లో ఇపుడు పాతిక చిత్రాల మైలు రాయిని దాటుతున్నాడు. ఆయన మహర్షి మూవీ తో ఆ ఫీట్ అధిగమిస్తున్నాడు.  ఆ తరువాత మూవీస్ కూడా వరసగా లైన్లో పెట్టేస్తున్నాడు.



ఎఫ్ 2 తో బంపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి డైరెక్షన్లో మహేష్ తరువాత  చిత్రం రెడీ అవుతోంది. హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు తన వెంకటేశ్వర బ్యానర్ పై మహేష్ తో ఈ  మూవీని తీస్తున్నాడు. ఈ మూవీలో ఓ కీలక‌మైన పాత్ర కోసం ఒకనాటి లేడీ సూపర్ స్టార్ విజయ‌శాంతిని తీసుకుంటున్నారుట. ఇపుడు విజయశాంతి మూవీస్ మానేసి రాజకీయాలో బిజీగా ఉన్నారు. ఆమె మళ్ళీ తెరంగ్రేట్రం చేస్తారని చెప్పడమే తప్ప ఇంతవరకూ వర్కౌట్ అయింది లేదు.


అయితే దిల్ రాజు, అనిల్ రావిపూడి ఈ మూవీ కధ చెప్పి ఆమెను ఒప్పించారట. ఈ మూవీలో మహేష్ తో సమానంగా ఓ   క్యారక్టర్ ఉందిట. అది మూవీకి ఎంతో అవసరమట. దాంతో విజయశాంతిని తీసుకుంటున్నారుట. ఇదిలా ఉండగా మహేష్ మూవీలో విజయశాంతి నటించడం అంటే ఓ రేర్ కాంబోనే. 


అయితే వీరిద్దరూ గతంలో అంటే మహేష్ చిన్నపుడు ఓ మూవీలో నటించారు. అదే కొడుకు దిద్దిన కాపురం  అందులో విజయశాంతి మహేష్ కి తల్లి పాత్రలో నటించారు. అది 1988 ప్రాంతంలో వచ్చి సూపర్ హిట్ అయింది. మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ కాంబో ఫిక్స్ కావడం అదీ కూడా దిల్ రాజు బ్యానర్లో, అనిల్ రావిపూడి డైరెక్షన్లో కావడంతో మూవీపై ముందే అంచనాలు బాగా పెరిగిపోతున్నాయి.
 



మరింత సమాచారం తెలుసుకోండి: