సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం తాను చేస్తున్న మహర్షి సినిమా తర్వాత సుకుమా తో 26వ సినిమా ఉంటుందని అనుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా రావాల్సి ఉంది. అయితే స్క్రిప్ట్ దశలోనే ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది. సుకుమార్ అల్లు అర్జున్ తో సినిమా కన్ఫాం చేసేసరికి ఆ రోజు సాయంత్రమే సుకుమార్ తో తన సినిమా క్యాన్సిల్ అని మహేష్ ట్వీట్ చేశాడు. 


అయితే మధ్యలో ఏం జరిగింది అంటే.. మహేష్ కోసం ఫుల్ స్క్రిప్ట్ తీసుకుని వెళ్లిన సుకుమార్ కు కొన్ని సలహాలు.. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు సూచించాడట మహేష్.. తాను చెప్పినట్టు చేయాలంటే కనీసం ఆరు నెలలైనా పడుతుందని ఈలోగా అనీల్ రావిపుడితో సినిమా పూర్తి చేయాలని మహేష్ ప్లాన్.


తనని కాదని అనీల్ తో సినిమా ఓకే చేస్తాడా అని వెంటనే వచ్చి బన్నితో సినిమా ఎనౌన్స్ చేయించాడు. అయితే దానికి మహేష్ చాలా అప్సెట్ అయ్యాడట. ఆ ట్వీట్ పెట్టే ముందు వరకు ఆలోచించి ఎలాగు సుకుమార్ బన్నితో ఫిక్స్ అయ్యాడు కదా అని మహేష్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నాడట. నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ మీద ప్రెజర్ తెచ్చారట. హీరో హర్ట్ అయ్యాడని తెలుసుకుని సుకుమార్ చేత మహేష్ కు క్షమాపణ చెప్పించారట.


మళ్లీ కథ మార్చి కలుస్తా అని చెప్పాడట. అయితే మహేష్ మాత్రం 26వ సినిమా అనీల్ రావిపుడితో చేసేందుకు ఫిక్స్ అయ్యాడు. ఆ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా ఉంటుందని తెలుస్తుంది. సుకుమార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలన్న మరో 8 నెలలు ఆగాల్సిందే. ఎందుకంటే త్రివిక్రం సినిమా ఇంకా మొదలు పెట్టలేదు. కాబట్టి అది మొదలుపెట్టి సినిమా పూర్తి చేయాలి. సో ఎలా లేదన్నా సుకుమార్ కు ఇటు మహేష్, అటు బన్ని ఇద్దరు ఓ సినిమా తర్వాతనే ఛాన్స్ ఇస్తారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: