కొత్త దనంతో చరిత్ర సృష్టిస్తాడన్న పేరున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో సాహసం చేయబోతున్నాడన్న వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఏకంగా ప్రిన్స్ కు పవర్ ను జోడించి టాలీవుడ్ లో ఓ బిగ్ హిట్ క్రియేట్ చేయడానికి ప్లానింగ్ మొదలయిందని అంటున్నారు. తెలుగు తెరపై అగ్రతారలుగా వెలుగొందుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబు లను హీరోలుగా పెట్టి సినిమా తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడట త్రివిక్రమ్.

ఇద్దరు హీరోల సినిమాలు తెలుగు తెరకు కొత్తేమి కాకపోయినా పవన్, మహేష్ కాంబినేషన్ అంటే టాలీవుడ్ లో సంచలనమే, అందుకే ఈవార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో వెంకటేష్, మహేష్ లు వచ్చారు. అలాగే విడుదలకు సిద్దంగా ఉన్న ఎవడు సినిమాలో కూడా అల్లు అర్జున్, రాంచరణ్ లు కలిసి నటించారు. ఇది కూడా పూర్తయితే మరో కొత్త హిట్ కాంబినేషన్ ను తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేయనున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: