టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న హీరోలు చాలా అరుదు. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ ఒకరు. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా తన అమాకత్వంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విజయ్ దేవరకొండ తర్వాత అర్జున్ రెడ్డి మూవీలో బోల్డ్ గా కనిపించి, నేచురల్ డైలాగ్స్ తో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఈ మూవీతో విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. కేవలం మన తెలుగు రాష్ట్రాలలోనే కాదు పక్క రాష్ట్రాలలోను విజయ్కి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇక అర్జున్ రెడ్డి తర్వాత గీత గోవిందం, టాక్సీవాలా వంటి సినిమాలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు తాజాగా టాప్ హీరోల లీస్ట్ లోకి చేరాడు. తాజాగా హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ 2018 లిస్ట్లో విజయ్ దేవరకొండ టాప్ 1 పొజీషన్లో ఉన్నాడు. స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ , రానా ఎన్టీఆర్ వంటి స్టార్స్ అందరిని వెనక్కి నెట్టి మొదటి స్థానం దక్కించుకున్నాడు.
2017లో రెండో స్థానంలో ఉన్న విజయ్ దేవరకొండ ఈ ఏడాది తొలి స్థానం దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్లో ఉన్న విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్లోనూ నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో నటిస్తున్నాడు.