యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో భరీ బడ్జెట్ తో వస్తున్న సినిమా సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక సినిమా నుండి ఈమధ్య వచ్చిన షేడ్స్ ఆఫ్ సాహో మేకింగ్ వీడియోస్ అదరగొట్టాయి. ఆగష్టు 15న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఇంటర్వల్ సీన్ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.


హాలీవుడ్ సినిమాలకు ధీటుగా సాహో సినిమా వస్తుందని అంటున్నారు. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 90 కోట్ల బడ్జెట్ యాక్షన్ సీన్స్ కే ఖర్చు పెడుతున్నారట. ముఖ్యంగా ఇంటర్వల్ సీన్ కోసం 30 కోట్లు పెడుతున్నారట. ఈ సీన్ మొత్తం అబుదాబిలో షూట్ చేయడం జరిగింది. 


ఇంటర్వల్ యాక్షన్ పార్ట్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందట. ఈ సీన్ చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు సీట్లలో కూర్చోరని అంటున్నారు. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఈ సాహోతో కూడా సంచలనాలు సృష్టించాలని చూస్తున్నాడు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు.


సాహో పూర్తి కాకముందే జిల్ ఫేం రాధాకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. జాన్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీని యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ప్రభాస్ రేంజ్ కు తగినట్టుగానే జాన్ సినిమా ఉంటుందట. సాహో, జాన్ రెండు సినిమాలతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలని చూస్తున్నాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: