కృష్ణవంశీ చేతి నుండి చేజారిపోయిన తామర పుష్పం ఆమె. అందుకే చందమామ రూపంతో ఇండస్ట్రీలో స్టార్డంను సొంతం చేసుకుంది. తనే కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ మరోసారి కృష్ణవంశీ మూవీలో నటించి ఉంటే కాజల్ అందాలను సిల్వర్ స్క్రీన్పై రెట్టింపు చేసేవాడు. అదే తనకి ఆఖరి మూవీ కూడ అయిండేది అని చాలా మంది అన్నవాళ్ళు ఉన్నారు. కాజల్ టైం బాగుండి క్రియోటివ్ డైరెక్టర్ ఫ్యామిలి ఓరియంటెడ్ మూవీలో నటించి టాలీవుడ్కి మరింత చేరువైంది. ఇప్పుడు అనుకోకుండా కాజల్ మరోసారి కృష్ణవంశీ మూవీలో నటిస్తుంది. అదే రామ్చరణ్,వెంకటేష్ మల్లీస్టారర్ ఫిల్మ్. ఇందులో రామ్చరణ్ సరసన కాజల్, వెంకటేష్ సరసన నయనతార నటించే అవకాశం ఉందంటున్నారు.
దీనికి సంబంధించిన అఫిషియల్ స్టేట్మెంట్ రావల్సి ఉంది. కాజల్కి ఎట్ప్రెజెంట్ టాలీవుడ్లో అవకాశాలు కరువయ్యాయి. అందుకే కృష్ణవంశీతో మాటలు కలిపింది, అలాగే రామ్చరణ్తోనూ మంచి పరిచయాలు ఉండటంతో ఆ మల్టీస్టారర్ ఫిల్మ్లో అవకాశాన్ని చేజిక్కించుకుంది. దీనికి కృష్ణవంశీ పెట్టిన కండిషన్కి కాజల్ ఒప్పుకొనే యాక్ట్ చేసేందుకు రెడీ అయిందంట. ఇంతకీ కాజ్ల్కి ఈ క్రియోటివ్ డైరెక్టర్ ఏం చెప్పాడంటే, ఈ మూవీలో కొద్దిపాటి ఎక్స్పోజింగ్ ఉంటుంది, అందుకు నో చెప్పకూడదని అన్నాడట. దీనికి ఓకె చెప్పిడంతో కాజల్ హీరోయిన్గా సెలక్ట్ అయిందంటున్నారు. అయితే క్రియోటివ్ డైరెక్టర్ దృష్టిలో కొద్దిగా అంటే ఆ ఎక్స్పోజ్ సెగ ఏమాత్రం ఉంటుందో కాజల్కి అప్పుడు తెలుస్తుందులే అని టాలీవుడ్ అంటుంది.