మహర్షి తర్వాత సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడితో సినిమా దాదాపు కన్ఫాం అయినట్టే. అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు కాని మహేష్ 26వ సినిమా సుకుమార్ తో క్యాన్సిల్ చేసుకుని అనీల్ రావిపుడితో ఫిక్స్ చేసుకున్నాడు మహేష్. ఇక ప్రస్తుతం మహర్షి ముగింపు కార్యక్రమాల్లో ఉండగా రీసెంట్ గా పరశురాం మహేష్ ను కలిసి ఓ లైన్ వినిపించాడని తెలుస్తుంది.


సోలో, యువత సినిమాల నుండి లాస్ట్ ఇయర్ వచ్చిన గీతా గోవిందం వరకు పరశురాం దర్శకుడిగా.. రచయితగా ఎప్పుడు ఫెయిల్ అవలేదు. గీతా గోవిందం సినిమాతో 100 కోట్ల దర్శకుడిగా కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు. తన తర్వాత సినిమా కూడా పరశురాం తోనే అని అంటున్నారు గీతా ఆర్ట్స్ వారు.


ఎలాగు గీతా ఆర్ట్స్, మహేష్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. సో పరశురాం డైరక్షన్ లోనే ఆ సినిమా ఉంటుందని అంటున్నారు. మహేష్ కు లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేయమని చెప్పాడట. విజయ్ దేవరకొండ రేంజ్ పెంచేసిన పరశురాం ఆల్రెడీ స్టార్ గా ఉన్న మహేష్ తో ఎలాంటి సినిమా చేస్తాడు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. 


సాధారణంగా అల్లు అరవింద్ మెగా హీరోలతోనే సినిమాలు చేస్తాడు. కాని మొదటిసారి మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్నాడట. మహేష్ రేంజ్ కు తగినట్టుగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారట. మహర్షి సినిమా రిలీజ్ తర్వాత ఈ కాంబినేషన్ సినిమపై ఓ క్లారిటీ వస్తుంది. మరి ఈ సినిమా సెట్ అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే. 



మరింత సమాచారం తెలుసుకోండి: