కొన్నిసార్లు నటీనటులు క్యారక్టర్ నచ్చకపోయినా చేయాల్సి వస్తుంది. అయితే అలా అయిష్టంగా చేసిన సినిమా.. అందులో ఆ పాత్ర సూపర్ హిట్ అయితే ఆ కిక్ వేరే.. ఎంత కెరియర్ కు ప్లస్ అయినా ఆ పాత్ర చేసేందుకు ముందు నిరాకరించిన సందర్భాలు గుర్తుకొస్తాయి. ప్రస్తుతం అలాంటి ఫీలింగ్ బయటపెట్టింది సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.


సూత్రదారులు సినిమాతో కథానాయికగా వెండితెర మీదకు అడుగుపెట్టిన రమ్యకృష్ణ ఇప్పటికి సూపర్ ఫాంలో ఉంది. గ్లామర్ మాత్రమే కాదు నీలాంబరి, శివగామి పాత్రలకు రమ్యకృష్ణ కేరాఫ్ అడ్రెస్ గా మారింది. సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా నరసింహా. ఆ సినిమాలో సౌందర్య హీరోయిన్ గా నటించగా నీలాంబరి పాత్రలో అద్భుతంగా చేసింది రమ్యకృష్ణ.


అయితే ఆ పాత్ర దర్శకుడు చెప్పగానే ముందు మరీ ఇంత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర తను చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించిందట. అయిష్టంగానే ఆ పాత్ర చేసిందట. అయితే ఆఫ్టర్ రిలీజ్ నీలాంబరి పాత్రే సినిమాను నిలబెట్టింది. రజినికాంత్ కు ధీటుగా నీలాంబరి పాత్ర మెప్పించింది. ఓ సీన్ లో సౌందర్య మొహం మీద కాలు పెట్టడం చాలా ఇబ్బందిగా అనిపించిందని చెప్పుకొచ్చింది రమ్యకృష్ణ.


మొత్తానికి ఇష్టం లేకుండా చేసిన ఆ పాత్ర నిజంగానే ఆమెకు చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది. నీలాంబరి తర్వాత సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చాలా వచ్చాయని చెప్పారు రమ్యకృష్ణ. బాహుబలి లాంటి సినిమాలో భాగం అవడం కూడా అదృష్టమని అంటుంది రమ్యకృష్ణ. లాస్ట్ ఇయర్ శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నటించి మెప్పించారు రమ్యకృష్ణ. 



మరింత సమాచారం తెలుసుకోండి: