మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తన పేరు మార్చుకున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అసలే సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ బాగా ఉంటాయి. అయితే సాయి ధరం తేజ్ గా పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెగా మేనళ్లుడు ఆ తర్వాత సుప్రీం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలతో హిట్ అందుకున్నాడు. 


ఇక తిక్క నుండి సాయి ధరం తేజ్ వరుస ఫ్లాపులు అందుకున్నాడు. ప్రస్తుతం సాయి ధరం తేజ్ కిశోర్ తిరుమల డైరక్షన్ లో చేస్తున్న సినిమా చిత్రలహరి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్ సరసన నివేదా పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


ఈ సినిమా నుండి మొదటి సాంగ్ పరుగు పరుగు అంటూ రీసెంట్ గా రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ లో సాయి ధరం తేజ్ బదులు సాయి తేజ్ అని పేరు వేశారు. సాయి ధరం తేజ్ పేరు మార్చుకుని సాయి తేజ్ గా మారాడమేంటని ఆశ్చర్యపోతున్నారు. ఇక నుండి మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ గా కాకుండా సాయి తేజ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.


ఈమధ్యనే రిలీజైన చిత్రలహరి టీజర్ ఇంప్రెస్ చేసింది. చూస్తుంటే నిజంగానే పేరు మార్చుకున్న సాయి ధరం తేజ్ సాయి తేజ్ గా హిట్టు కొట్టేలా ఉన్నాడు. నేను శైలజా, ఉన్నది ఒకటే జిందగి సినిమాలతో తన ప్రతిభ చాటుకున్న కిశోర్ తిరుమల చిత్రలహరి పక్కా హిట్టు టార్గెట్ తో చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 12న రిలీజ్ ప్లాన్ చేశారు.     



మరింత సమాచారం తెలుసుకోండి: