టాలీవుడ్ లో ‘ఒక మనసు’సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది మెగా బ్రదర్ కూతురు కొణిదెల నిహారిక. ఈ సినిమా యావరేజ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత నటించిన సినిమాలు అసలు థియేటర్లోకి వచ్చిన విషయం కూడా తెలియని పరిస్థితి. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే టివిలో ‘ఢీ’రియాల్టీ షోలో యాంకర్ గా తనదైన ముద్ర వేసిన నిహారిక హీరోయిన్ గా మాత్రం ఇప్పటి వరకు మంచి పేరు తెచ్చుకోలేకపోతుంది. తాజాగా నిహారిక మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న ‘సూర్యకాంతం’ సినిమా మార్చి 29 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.
ఈ సినిమాలో ఇప్పటి వరకు కనిపించని విధంగా చాలా బబ్లీగా కనిపించబోతుందట నిహారిక. ప్రణీత్ దర్శకత్వంలో ‘సూర్యకాంతం’సినిమాకు సృజన్, సందీప్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, లిరికల్ సాంగ్స్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. అంతే కాదు ఈ సినిమాపై నిహారిక దనదైన శైలిలో ప్రమోషన్ కూడా చేస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చి 23 వ తేదీన జెఆర్సీ కన్వెన్షన్లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు.
ఈ వెంట్ కు అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ సెంట్రల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నాడా..నిహారిక సినిమాకు విజయ్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతుండంతో అంచనాలు మరో స్థాయికి చేరుకున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.