ఖైదీ నెంబర్ 150 సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పునః ప్రవేశం చేసి ఆ సినిమాతో అద్భుత విజయాన్ని అందుకుని ఇంకా తన చరిష్మా తగ్గలేదని నిరూపించారు. ఇక ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత చిరు, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. మొదటి సినిమా మిర్చి నుండి మొన్నటి భరత్ అనే నేను వరకు వరుసగా బంపర్ హిట్స్ కొడుతూ కెరీర్ పరంగా అపజయమెరుగని కొరటాల, చిరుతో చేయబోయే సినిమా కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. 


ఇక ఈ సినిమాలో రైతులు, మరియు వారు పడుతున్న కష్టాల కు సంబందించిన అంశాన్ని తీసుకుని కథను అల్లడం జరిగిందని సమాచారం. ఇకపోతే మొదటినుండి తన సినిమాల్లో మంచి సామాజిక మెసేజ్ ఇస్తూనే అదే సినిమాని కమర్షియల్ పంథాలో ముందుకు తీసుకెళ్తున్న కొరటాల, ఈ సినిమాలో కూడా రైతుల అంశంతోపాటు మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకునే అన్ని కమర్షియల్ హంగులు కలగలిపి కథను ఎంతో ఆకట్టుకునేలా తయారుచేసారట. ఇక ఇటీవల చిరు చేసిన ఖైదీ నెంబర్ 150 సినిమా కథ కూడా రైతులకు సంబందించిన కథే అన్న విషయం తెలిసిందే. 


ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్త నిజమే అయితే, మరి ఈ విధంగా మరొక్కసారి రైతుల్ని నమ్ముకుని ముందుకు వస్తున్న మెగాస్టార్ కు రేపు విడుదల తరువాత ఈ సినిమా ఎటువంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాని ఒక బడా నిర్మాత నిర్మించడానికి అప్పుడే సన్నాహాలు మొదలెట్టారని, ఇక మరికొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని  సమాచారం....


మరింత సమాచారం తెలుసుకోండి: