టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకైన 25వ సినిమా మహర్షి లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత మహేష్, ఇటీవల ఎఫ్2 తో బంపర్ హిట్ కొట్టి, వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారన్న వార్త ఇప్పటికే చాలా రోజులుగా టాలీవుడ్ వర్గాల్లో, విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమాని 14 రీల్స్ సంస్థ నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర, తన సొంత బ్యానర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అత్యంత భారీ ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారట. 

Image result for rashmika mandanna

అయితే అసలు విషయం ఏంటంటే, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని అందులో మెయిన్ హీరోయిన్ ఎంపిక ఇప్పటికే జరిగిపోయిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఆమె మరెవరో కాదు, చలో సినిమాలో నాగశౌర్య సరసన నటించి, తన అందంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని, ఆ తరువాత విజయ్ దేవరకొండ తో గీత గోవిందం వంటి సూపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రష్మిక. ఇక ఈ క్రేజీ సినిమాలో రష్మిక ని హీరోయిన్ గా ఎంపిక చేశారని వార్తలు కూడా ప్రచారంలో నిలిచాయి.

Image result for anil ravipudi

ఇక నేడు అందుతున్న సమాచారం ప్రకారం, రష్మిక ఈ ప్రతిష్టాత్మక సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయిన మాట నిజమేనట. రెండు రోజుల క్రితం ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన రష్మిక, తనకు సూపర్ స్టార్ మహేష్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని తనకి సన్నిహితుల వద్ద చెప్పి ఎంతో సంబరపడి పోయిందట. అయితే ఇదే విషయాన్ని వారిలో కొందరు బయటకు లీక్ చేయడంతో ప్రస్తుతం ఈ వార్త మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ వార్త కనుక నిజమైతే రష్మిక రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: