రౌడీ స్టార్, యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ మూవీ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న నటిస్తుంది. ఈమధ్య వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. మే 31న రిలీజ్ అవుతున్న ఈ సినిమా బిజినెస్ అదరగొడుతుంది.


సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ బిజినెస్ లో కూడా అదిరిపోతుంది. నైజాం, సీడెడ్ కలిపి 11 కోట్ల దాకా బిజినెస్ చేసిందట. ఆంధ్రాలో 10 కోట్ల దాకా కోట్ చేశారట. ఓవర్సీస్ లో కూడా విజయ్ స్టామినాకు తగినట్టుగానే బిజినెస్ చేస్తుందని తెలుస్తుంది.


డియ కామ్రేడ్ కేవలం తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. వరుస విజయాలతో దూసుకెతున్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లో దుమ్ముదులిపేస్తున్నాడు. గీతా గోవిందం సినిమాలో కలిసి నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన విజయ్, రష్మిక మరోసారి కలిసి నటించడం క్రేజీగా మారింది.


ఈ సినిమా తర్వాత విజయ్ క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో పాటుగా ఆనంద్ అన్నామలై డైరక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేస్తున్నాడు. షాలిని పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.  అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండతో షాలిని పాండే నటించే సినిమా ఇదే అవడం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: