టాలీవుడ్ లో వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా రైతు సమస్యలపై ఉండటంతో పాటు మెగాస్టార్ తన పవర్ ఏంటో చూపించారు. అప్పటి వరకు మెగాస్టార్ పై ఉన్న నెటిజన్ల అనుమానాలు పటాపంచలు చేస్తూ బాస్ ఈజ్ బ్యాక్ అన్నారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ లో ఒకప్పటి బ్రిటీష్ వారిని తరిమి కొట్టిన తెలుగు బిడ్డ మొట్టమొదటి తెలుగు పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’సినిమా తీస్తున్నారు.
ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి సినిమా ఎప్పుడూ చూడని విధంగా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా కోసం మరో యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయవలసి ఉందట. ఈ పోరాట సన్నివేశాలను చైనాలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ తో పాటు మరికొంత మంది నటులతో ఈ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట.
సినిమాకు ఇవే హైటెల్ సన్నివేశాలని చిత్ర యూనిట్ చెప్పకుంటున్నారు. ఈ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. వచ్చే నెలలో అక్కడ ఈ షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. అమితాబ్ .. జగపతిబాబు కీలకమైన పాత్రలను పోషిస్తోన్నారు. ఈ సినిమాలో నయనతార, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి ఇలా అన్ని భాషల నటీనటులు ఉన్నారు. ఈ సినిమాను, ఆగస్టు 15వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.