తెలుగు, తమిళ, మాళియాళ భాషల్లో స్టార్ హీరోగా వెలిగిపోతున్న నటి నయనతార. మొదటి సినిమానే సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఛాన్స్ కొట్టేసి ఆ తర్వాత తెలుగు, తమిళ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. దక్షిణాదిన అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటి నయనతార. తాజాగా నయనతారపై తమిళ సీనియర్ నటుడు రాధారవి అనుచిత వ్యాఖ్యలు చేసినందకు ప్రముఖ నిర్మాణ సంస్థ కేజేఆర్ స్టూడియోస్ భారీ షాకిచ్చింది.
వివరాల్లోకి వెళితే..ఓ సినిమా ట్రైలర్ కార్యక్రమానికి రాధారవి అక్కడ నయన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే కార్యక్రమానికి హాజరైన వారు నవ్వుతూ చప్పట్లు కొట్టడం బాధాకరమని కేజేఆర్ స్టూడియోస్ ఆవేదన వ్యక్తం చేసింది. చిత్ర పరిశ్రమలో ఎంతో సీనియర్ నటుడు అయి ఉండి ఇలాంటివి ఖండిచకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొంది. గొప్పతనం పేరులో ఉండదని, మాట తీరులోనే ఉంటుందని స్పష్టం చేసింది. ‘అరం’, ‘విశ్వాసం’, ‘ఐరా’ వంటి సినిమాలను నిర్మించింది ఈ సంస్థే.
అంతేకాదు, ఆయనతో కలిసి పనిచేయవద్దని ఇతర నటీనటులను, నిర్మాణ సంస్థలను కోరింది. ‘అరం’, ‘విశ్వాసం’, ‘ఐరా’ వంటి సినిమాలను నిర్మించింది ఈ సంస్థే. ఇక రాధారవి ప్రవర్తనపై కోలీవుడ్ నటులు మండిపడుతున్నారు. రాధారవి సోదరి రాధిక, నటి వరలక్ష్మి శరత్ కుమార్, దర్శకుడు విఘ్నేశ్ శివన్, గాయని చిన్మయి తదితరులు రాధారవిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని డిగర్ సంఘం గుర్తించే ఉంటుందని, ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటుందనే ఆశిస్తున్నట్టు నిర్మాణ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.