టాలీవుడ్ లో తనదైన కామెడీతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అల్లు రామలింగయ్య తనయుడు అల్లు అరవింద్ ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్. ఆయన తనయుడు అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు..తనదైన స్టైల్ తో ఫైట్స్, డ్యాన్స్ తో మెగా ఫ్యాన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం పవన్ కళ్యాన్ తర్వాత మాస్ ఫాలోయింగ్ ఉన్న మెగా హీరోలు అల్లు అర్జున్, రాంచరణ్.
ఈ మద్య వస్తున్న సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నిలబడటానికి కృషి చేస్తున్నారు. అయితే టాలీవుడ్ లో నకి సంబంధించిన ప్రతి విషయం కొత్తగా వుండాలని ఆయన భావిస్తుంటాడు బన్ని. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంటాడు. తన కుటుంబ సభ్యులతో ఏ ఈవెంట్ అయినా ఫ్యాన్స్ కి షేర్ చేస్తుంటాడు. తాజాగా బన్ని కొత్త క్యారవాన్ కొన్ని విషయం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చలు కొనసాగుతున్నాయి. టాలీవుడ్లో ఇంతవరకూ ఖరీదైన క్యారవాన్ మహేశ్ బాబుకి మాత్రమే వుంది.
కొంతకాలం క్రితమే 3 నుంచి 4 కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఈ క్యారవాన్ కొనుగోలు చేశాడు. అయితే మహేష్ కన్నా విలాసవంతమైన, సౌకర్యవంతమైన క్యారవాన్ ను అల్లు అర్జున్ కొనుగోలు చేశాడనేది టాలీవుడ్ టాక్. త్వరలోనే ముంబైలో తయారుచేయబడుతోన్న ఈ క్యారవాన్ త్వరలోనే హైదరాబాద్ కి రానున్నట్టు సమాచారం. ఈ క్యారవాన్ కోసం అల్లు అర్జున్ 7 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. నా పేరు సూర్య సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.