కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. గత ఏడాది శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 మంచి విజయం సాధించింది. రూ.450 కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమాకు భారీ ఎత్తున మాత్రం కలెక్షన్లు రాలేదు. ఈ సినిమా తర్వాత మరో సీక్వెల్ కి ప్లాన్ చేశారు శంకర్. అప్పట్లో శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు’ఘన విజయం అందుకున్న విషయం తెలిసిందే.
2.0 సినిమా తర్వాత భారతీయుడు మూవీ సీక్వెల్ తీయాలని భావించారు. కమల్ హాసన్, కాజల్ జంటంగా ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. కమల్ హాసన్ రాజకీయాల్లో ప్రత్యక్షంగా పోటీ చేయాలని భావించడం..ఈ సినిమా వాయిదాకి కారణాలని వార్తలు వచ్చాయి. లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో ఆయన ఈ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత శంకర్ తదుపరి సినిమా హీరో 'హృతిక్ రోషన్' అనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.
ఈ మూవీ సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ కొనసాగనుందట. గతంలో హృతిక్ పలు సైంటిఫిక్ మూవీలో నటించడంతో ఈ సినిమాకు అయితేనే సరిగ్గా సరిపోతాడని భావించి, ఆయనను సంప్రదించడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను ఆయన టీమ్ పూర్తి చేసే పనిలో ఉందట. దీనికి సంబంధించిన అఫిషియల్ ప్రకటన త్వరలో అనౌన్స్ కూడా చేయబోతున్నట్టు సమాచారం.