ఒకప్పుడు హాలీవుడ్ లో డేటింగ్ కల్చర్ ఎక్కువగా ఉండేది.  రాను రాను భారత దేశంలో కూడా డేటింగ్ కల్చర్ విస్తురిస్తుంది. ముఖ్యంగా సెలబ్రెటీలు చాలా మంది డేటింగ్ కల్చర్ కి బాగా అలవాటు పడ్డారనే చెప్పొచ్చు.  తాజాగా ఎవడు, ఐ, 2.0 లాంటి మూవీస్‌లో నటించిన అమీ జాక్సన్ తాను గర్భవతినని ప్రకటించింది. మల్టీ మిలియనీర్ జార్జ్ పనాయిటౌతో డేటింగ్ చేస్తున్న అమీ.. త్వరలోనే తన తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నది.  ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి మాతృదినోత్సవానికి మించిన సరైన రోజు మరొకటి లేదని వెల్లడించింది.


బ్రిటన్ లో మదర్స్ డే కావడంతో అమీ ఈ విషయం అందరితో పంచుకుంది. ‘‘మీ అందరికీ ఈ విషయాన్ని అరిచి మరీ చెప్పాలని ఎదురుచూస్తున్నాను. ఈ విషయం చెప్పేందుకు మాతృదినోత్సవానికి మించిన సరైన రోజు మరొకటి ఉండదు. ఈ ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను చూసేందుకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం’’ అని పోస్ట్ పెట్టింది’అంటూ ట్విట్ పెట్టింది అమీ జాక్సన్.  


మద్రాసు పట్టణం మూవీతో తెరంగేట్రం చేసిన అమీ జాక్సన్.. తర్వాత హిందీ, తెలుగు సినిమాల్లోనూ నటించింది. బాలీవుడ్‌లో అక్షయ్ సరసన సింగ్ ఈజ్ బ్లింగ్, నవాజుద్దీన్‌తో కలిసి ఫ్రీకీ అలీ సినిమాల్లో పని చేసింది. చివరిగా శంకర్ 2.0 మూవీలో రజనీకాంత్ పక్కన నటించింది.  అమీ నటించిన కిక్ 2 మూవీ విడుదలకు సిద్ధమవుతున్నది. 

మరింత సమాచారం తెలుసుకోండి: