నాగ చైతన్య, సమంతలు జంటగా శివ నిర్వాణ డైరక్షన్ లో ఏప్రిల్ 5న రిలీజ్ అవుతున్న సినిమా మజిలీ. ఏమాయ చేశావె నుండి చైతు, సమంతలు నటించిన సినిమాలకు సూపర్ క్రేజ్ ఏర్పడగా పెళ్లి తర్వాత ఈ ఇద్దరు కలిసి భార్యాభర్తలుగా నటిస్తున్న సినిమాగా మజిలీ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.


ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం జె.ఆర్.సి కెన్వెన్షన్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు గెస్టులుగా విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున అటెండ్ అయ్యారు. ఈవెంట్ లో భాగంగా చైతు, సమంతల సీక్రెట్ లవ్ గురించి నాగార్జున షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏమాయ చేసావె సినిమా చూసి జంట బాగుందని అనుకున్నానని.. మనం టైంలో ఇద్దరు సీక్రెట్ రొమాన్స్ చేశారని.. అయితే అప్పుడు కూడా తన దగ్గర బయట పడలేదని అన్నారు నాగార్జున.


ఓరోజు ఇంటికి సమనత వస్తే తమ కుక్క పిల్ల ఆమె దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లింది. అప్పుడు తెలిసింది వీరిద్దరి లవ్ సంగతి అంటూ నాగార్జున ఫన్నీ కామెంట్స్ చేశారు. వెధవలకే మంచి అమ్మాయిలు భార్యలుగా వస్తారన్న మజిలీ డైలాగ్ కు కాస్త బాధపడినట్టు అనిపించినా మంచి అబ్బాయిలకు మంచి అబ్బాయిలు దొరుకుతారని అన్నాడు నాగార్జున.    


సినిమా ఫలితం మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న నాగార్జున తన కొడుకు హిట్టు కొడుతున్నాడన్న సంతోషం తన ముఖంలో కనిపించింది. వేడుకకు విశిష్ట అతిథిగా వచ్చిన వెంకటేష్ కూడా సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఉగాదికి పెద్ద పండుగ తెస్తుందని అన్నారు. సినిమాలో చైతు, సమంతలతో పాటుగా దివ్యాన్ష కౌశిక్ కూడా నటించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: