కృతి సనన్ .. తెలుగులో మహేష్ సరసన నేనొక్కడినే సినిమాలో నటించింది. ఆ సినిమా ఫ్లాఫ్ అవ్వడంతో పాపం ఈ అమ్మడుకి అవకాశాలు తగ్గిపోయాయి.  నాగ చైతన్య నటించిన 'దోచెయ్' లో కూడా హీరోయిన్.  తెలుగులో సక్సెస్ రాలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్.  ఇన్స్టాగ్రామ్ లో 19 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. 


తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు ఒక ఫిలాసఫికల్ కొటేషన్ ను క్యాప్షన్ గా ఇచ్చింది.  "ఆమె ప్రేమ కోసం పరితపించింది. కానీ అది ఒక అల కాదు.. ఏకంగా సముద్రం - మార్క్ అంటోనీ.   #త్రో బ్యాక్ # మాల్దీవ్స్"  అయితే ఆమె చెప్పిన ఫిలాసఫీ కంటే ఆమె ఫోటోకే ఎక్కువగా కామెంట్స్ వచ్చాయి.  హాట్ అని.. క్యూట్ అని.. నైస్ ఫిగర్ అని తమకు తోచినట్టుగా కృతి సనన్ ను మెచ్చుకున్నారు. 


ఏమాటకామాటే చెప్పుకోవాలి.  కృతి అందమైన పాలరాతి శిల్పంలా ఉంది. క్లీవేజ్ అందాలు.. ఒంపుసొంపుల వడ్డన సరేసరి.  బాలీవుడ్ మిల్కీ బ్యూటీ అని మనం ట్యాగ్ కూడా ఇచ్చేయొచ్చు అంత అందంగా ఉంది. ఈ ఫోటో నెటిజనులకు కూడా తెగ నచ్చినట్టుంది. ఇప్పటివరకూ1.2 మిలియన్స్ పైగా లైకులు కొట్టారు.  కృతి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'కళంక్'.. 'అర్జున్ పాటియాలా'.. 'హౌస్ ఫుల్ 4'.. 'పానిపట్' సినిమాల్లో నటిస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: