సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మహర్షి. మహేష్ 25వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా ప్రెస్టిజియస్ గా తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. మే 9న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతుంది.


ఓవర్సీస్ లో సినిమా బిజినెస్ డీల్స్ జరుగుతుండగా లేటెస్ట్ గా డిజిటల్, శాటిలైట్ రైట్స్ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. జెమిని టివి వారు మహర్షి సినిమాను 16.8 కోట్లకు శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్నారని తెలుస్తుంది. ఇక డిజిటల్ రైట్స్ కూడా అమేజాన్ 11 కోట్లకు కొనేసిందట. అంటే థియేట్రికల్ బిజినెస్ కాకుండానే మహర్షి ఖాతాలో 26 కోట్లు వచ్చాయి. 


ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 100 కోట్లకు పైగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేష్ అల్లరి నరేష్ ఇద్దరు స్నేహితులుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుండి రీసెంట్ గా రిలీజైన మొదటి సాంగ్ చోటి చోటి బాతె సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న మహర్షిపై అంచనాలు భారీగా ఉన్నాయి.


అరవింద సమేత తర్వాత పూజా హెగ్దె ఈ సినిమా చేస్తుంది. టాలీవుడ్ లో మొదట్లో కెరియర్ కాస్త అటు ఇటుగా ఉన్నా ప్రస్తుతం పూజా హెగ్దె వరుస అవకాశాలతో అదరగొడుతుంది. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న మహర్షి సినిమా మహేష్ కెరియర్ లో మరో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని చెబుతున్నారు మేకర్స్.



మరింత సమాచారం తెలుసుకోండి: