టెలివిజన్ నటి, మోడల్ రుషీ సింగ్ కేసు నమోదైంది.   తప్పతాగి వాహనం డ్రైవింగ్ చేయడమే కాకుండా పోలీసు అధికారిపై చేయి చేసుకోవడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ముంబైలోని ఖార్ ప్రాంతంలో సోమవారం తెల్లవారు జామున జరిగింది.  వివరాల్లోకి వెళితే.. ముంబైలో ఖార్ రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా.. సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తన స్నేహితులు రాహుల్, స్వాప్నిల్ లతో కలిసి మద్యం సేవించిన రూహి సింగ్ కారు నడుపుకుంటూ వచ్చింది.  లింక్ రోడ్డులో ఫుడ్ తినడానికి కారు ఆపారు.

అయితే అప్పటికే క్లోజింగ్ టైం పూర్తవ్వడంతో హోటల్ సిబ్బంది ఫుడ్ ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో ఈ నటి వారిపై కోపంతో ఊగిపోయారు..తానెవరో తెలియదని..తన బ్యాగ్ గ్రౌండ్ ఏంటో తెలియకుండా అవమానించారని..రచ్చ చేసింది. వారితో గొడవకి దిగడంతో కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశారు.  సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన రూహి ఆమె స్నేహితులు పోలీసులపై దాడి చేశారు. 

 ఇంకేముందీ.. స్పీడ్ తెలియలేదు.. శాంటాక్రాజ్ దగ్గర నాలుగు కార్లు, మూడు బైక్‌లను త‌న కారుతో  ఢీకొట్టింది. ఆ వాహనాలు బాగా డ్యామేజ్ అయినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. కాకపోతే ఈ యాక్సిడెంట్ లో ఎవరూ గాయపడలేదు. ఆ తరువాత పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకొని బ్లడ్ సాంపిల్స్ సేకరించారు. అయితే అర్ధరాత్రి మహిళలను అరెస్ట్ చేయకూడదనే రూల్ ఉండడంతో ఆమెపై కేసులు నమోదు చేసి పంపించేశారు. రక్త పరీక్షలు పూర్తయిన అనంతరం రూహిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: