రకుల్ ప్రీతీ సింగ్ కు తెలుగు వరుసగా ప్లాఫ్ లు రావటంతో అవకాశాలు రావటం కష్టమయి పోయాయి. అయితే రకుల్ ఈ సారి రొమాంటిక్ కామెడీ చిత్రం దే దే ప్యార్ దే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రంలో 50 సంవత్సరాల అంకుల్ అజయ్ దేవగన్‌కు ప్రియురాలిగా నటించడం గమనార్హం. అజయ్ దేవగన్ భార్యగా సీనియర్ హీరోయిన్ టబు నటించింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను అందుకొంటున్నది. నాటుగా.. ఘాటుగా ఉన్న ఈ ట్రైలర్ ఎలా ఉందంటే.. 


అమ్మాయి, అబ్బాయి కలుసుకొన్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. అంతా జరిగిపోయింది. దాంటో తప్పేముంది అంటూ అజయ్ దేవగన్ డైలాగ్ చెప్పగా.. గతరాత్రి ఏం జరిగిందో తెలియదు గానీ.. నేను బాగా ఎంజాయ్ చేశాను.. రకుల్ ట్రైలర్‌లో కామెంట్ చేయడం హాట్ హాట్ సీన్లకు కొదువలేదనే ఫీలింగ్ కలిగింది. ఓ డబ్బు ఉన్న ముసలివాడు. ఓ హాట్ హాట్‌గా ఉన్న యువతి. అమ్మాయికి ముసలివాడి వద్ద డబ్బు కనిపించింది. అమ్మాయి వద్ద ముసలివాడికి యవ్వనం కనిపించింది. వారి వద్ద లేని వాటికి కోసం వారిద్దరూ రాజీ పడుతున్నారు అని ట్రైలర్‌లో జావేద్ జాఫ్రీ చెప్పిన డైలాగ్స్ ఆసక్తిని రేపాయి. 


దే దే ప్యార్ దే ట్రైలర్‌లో మరో సన్నివేశంలో ఒక్కసారి పడుకొంటే ప్రేమ పుడుతుందా అంటూ రకుల్ వయ్యారంగా అడిగే తీరు సినిమాలో రోమాంటిక్ పాళ్లను తెలియజెప్పింది. మొత్తంగా భార్యకు దూరమై.. వయసుపైబడిన యువతి మధ్య రొమాన్స్ చాలా వినోదాత్మకంగా ఉండే అవకాశాలు ట్రైలర్‌లో కనిపించాయి. ముసలితనంలో పిల్లల సహాయం తీసుకోవాలి. భార్యతో కాదు అంటూ జావెద్ జాఫ్రీ చెప్పిన డైలాగ్స్‌కు అజయ్ దేవగన్ సైటెర్ వేయడం ఆకట్టుకొన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: