2016లో సంక్రాంతి కానుకగా విడుదలై అశేష ప్రేక్షాకదరణ పొందిన మూవీ సోగ్గాడే చిన్ని నాయనా. ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేశారు. ఒక పాత్ర బంగార్రాజుగా అల్లరిగా ఉంటే మరోపాత్రలో అమాయకంగా కనిపించాడు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నటించారు. మరో ముఖ్యపాత్రలో అనుష్క, యాంకర్ అనసూయ నటించారు. అయితే ఈ సినిమా సీక్వెల్ నాగార్జున చేయనున్నాడని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున 'మన్మథుడు 2' ప్రాజెక్టును మొదలు పెట్టేశారు. దాంతో 'బంగార్రాజు' ఇప్పట్లో ఉండకపోవచ్చనే టాక్ వచ్చింది.
దీనిపై పాపులర్ ఇంగ్లీష్ డైలీ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ నాగ్ చిన్న క్లారిటీ ఇచ్చాడు. బంగార్రాజు అనే టైటిల్తో తెరకెక్కనున్న ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటుంది. బంగార్రాజు చిత్ర కథ మొత్తం బంగార్రాజు చుట్టూనే తిరగనుండగా, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందట. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలో ఎన్నికల హడావుడి అయిపోయిన తర్వాత 'బంగార్రాజు' సినిమాను పట్టాలెక్కించనున్నట్టు చెప్పారు.
ఒక వైపున 'మన్మథుడు 2' చేస్తూనే .. మరో వైపున 'బంగార్రాజు' చేస్తారన్న మాట. బంగార్రాజు సినిమాలో నాగ్ సరసన రమ్యకృష్ణ నటించనున్నదట. అంతే కాదు ఈ మూవీలో బంగార్రాజు మనవడి పాత్రలో నాగ చైతన్య కూడా నటించనున్నట్లు సమాచారం. అయితే ఆయనకి జోడీగా ఎవరిని ఎంపిక చేయాలా అని చిత్రబృందం కసరత్తులు చేస్తుందట. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్పై ఈ మూవీ నిర్మితం కానుంది.