భారతీయ చిత్ర సీమలో ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించి మెప్పించిన విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భాయతీయుడు 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షెడ్యూల్ మొదలైంది..ఫస్ట్ లుక్ వచ్చింది..కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. దీనికి కారణం వచ్చే ఏడాది కమల్ హాసన్ తమిళ నాట తన పార్టీ తరుపు నుంచి ప్రత్యక్షంగా నిలబడబోతున్నారని..అందుకు ఇప్పటి నుంచి పార్టీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని..ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో భారతీయుడు 2 కి తన సమయం కేటాయించబోతున్నారని వార్తలు వచ్చాయి.
భారతీయుడు 2 మూవీని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కమల్ హాసన్ కి జోడీగా కాజల్ నటిస్తుంది. ఈ సినిమా గురించి తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడారు. భారతీయుడు 2 లో రాజకీయాల గురించి చూపించబోతున్నారా? అని విలేఖరి ప్రశ్నించగా.. ప్రస్తుతం నేను ఒక సినిమాలో నటిస్తున్నా. నా ఆలోచనలు ఇప్పుడు ప్రజలవైపునకు మళ్లాయి. సినిమాలో రాజకీయ సిద్ధాంతాలు ఉన్నాయా, లేవా అనేది దర్శకుడు నిర్ణయించాలి..ఆయనే చెప్పాలి.. అని అన్నారు.
ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో నా పూర్తి సమయాన్ని రాజకీయాలకి కేటాయించాలని నిర్ణయించుకున్నాను. ఇది నా అభిమానులకు నిరాశను కలిగించే విషయమే. అలాంటి అభిమానులంతా నన్ను క్షమించాలి .. ఎందుకంటే సినిమాలు . రాజకీయాలు ఒకే సమయంలో చేయలేను. రాజకీయాల్లోకి ఆలస్యంగా వచ్చాను గనుక, చేసేందుకు చాలా పనులు వున్నాయి. ఆ పనులన్నీ కూడా త్వరత్వరగా చేస్తూ వెళ్లాలి అని చెప్పుకొచ్చారు.