టాలీవుడ్ లో బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మాయాజాలం చేసిన దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం రాంచరణ్, ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ సినిమాకు సిద్దమయ్యారు. దానయ్య నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ మూవీ నిర్మితమవుతుంది. అయితే పూనేలో షూటింగ్ జరుపుకుంటున్న సందర్బంలో రాంచరణ్ కాలుకి గాయం కావడంతో ఈ ప్రాజెక్ట్కి కొద్ది రోజులు బ్రేక్ పడింది. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో తమిళ నటుడు సముద్రఖని నటిస్తున్నారు. ఈయన కూడా దర్శకత్వం ఫీల్డ్ నుంచి వచ్చినవారే.
తమిళ హీరో ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమాలో హీరోగా తండ్రిగా నటించారు సముద్రఖని. తెలుగు, తమిళ మూవీస్ లో నటిస్తున్న ఈయన తెలుగు వారికి సుపరిచితమే. ఇక రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ ఆకాశవాణి అనే మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కూడా సముద్రఖని ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్కి బ్రేక్ పడడం వలన రాజమౌళి.. ఆకాశవాణి షూటింగ్ స్పాట్కి వెళ్లారు. అక్కడ సముద్రఖని రాజమౌళి ఓ ఫోటో దిగారు. ఓ వైపు తండ్రి తీస్తున్న సినిమాలో నటిస్తూనే...తనయుడు నిర్మిస్తున్న సినిమాలో నటించడం నిజంగా ఈ తమిళ నటుడు లక్కీ స్టార్ అని చెప్పొచ్చు.