రాజమౌళి డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మాణంలో 400 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో రియల్ హీరోస్ పాత్రల్లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ నటిస్తున్నారని తెలిసిందే. కొమరం భీమ్ గా ఎన్.టి.ఆర్, అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తున్నారు.  


ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్త్ చేసుకున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్ పూణెలో మొదలు పెట్టారు. అయితే జిం ట్రైనింగ్ లో రాం చరణ్ కు గాయాలవడంతో షూటింగ్ కు 3 వారాల పాటు బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది. ఈ మూవీలో చరణ్ కు అలియా భట్, ఎన్.టి.ఆర్ కు డైసీ ఎడ్గర్ జోన్స్ జోదీగా నటిస్తారని తెలిసిందే.   


అయితే అనూహ్యంగా ఈ భారీ ప్రాజెక్ట్ నుండి డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకున్నట్టు తెలుస్తుంది. డైసీ సినిమా చేయట్లేదన్న విషయాన్ని ఆర్.ఆర్.ఆర్ చిత్రయూనిట్ అఫిషియల్ గా ఎనౌస్ చేసింది. సినిమాలో తారక్ కు జోడీగా డైసీ పేరు ఎనౌన్స్ చేయగానే ఆమె గురించి అందరు గూగుల్ లో వెతికేశారు. ఇప్పుడు ఆమె ఎందుకు ఆర్.ఆర్.ఆర్ నుండి తప్పుకుందో తెలియలేదు. 


మరి ఎన్.టి.ఆర్ కు జోడీగా ఇంకెవరిని తీసుకుంటారో తెలియాల్సి ఉంది. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. బాహుబలి రికార్డులను బ్రేక్ చేసేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో అజయ్ దేవగన్ కూడా ఉంటాడని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: