రకుల్ ప్రీత్ సింగ్ అందమైన హీరోయిన్. లక్కీగా తెలుగులో ఎన్నో సినిమాలు వరసగా చేసేసింది. టాప్ స్టార్స్ తో జోడీ కట్టి సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ పొడుగు సుందరి బాలయ్యతో ఆకు చాటు పిందె తడిసే అంటూ డ్యాన్స్ చేసింది. అదే సమయంలో నాగ్ తో మన్మధుడు 2 చేస్తోంది. సీనియర్లు ఐనా జూనియర్లు అయినే ఒకే అంటున్న  రకుల్ టాలీవుడ్ మీద ఇపుడు బాగా టార్గెట్ చేసింది.

 

అందంతో పాటు తెలివి ఎక్కువగా ఉన్న ఈ అమ్మడు ఒక్కసారిగా టాలీవుడ్ హీరోలను పొగడ్తలతో ముంచేస్తోంది. . తనకు స్టార్ స్టేటస్ రావడానికి తెలుగు సినిమాలే కారణమని అంటూ, తెలుగు హీరోలను ఆకాశానికెత్తేస్తోంది రకుల్. తెలుగులో ఎన్టీఆర్, రామ్చరణ్, అల్లు అర్జున్ గొప్ప డ్యాన్సర్లనీ, వాళ్లతో కలిసి డ్యాన్స్ చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదంటోంది. తెలుగు హీరోల డ్యాన్స్ మూమెంట్స్పై ‘మీకు ఎముకలు లేవా’ అంటూ సరదాగా జోక్ చేస్తుంటానని కూడా చెప్పుకొచ్చింది.

 


వీళ్లంతా స్టార్ హీరోలే అయినా చాలా సింపుల్గా ఉంటారు. సీన్ అనుకున్నట్టు వచ్చేంత వరకూ డెడికేషన్తో పని చేస్తుంటారు. అదే వాళ్ల విజయ రహస్యం’ అంటోంది రకుల్. హిందీలో ‘దే దే ప్యార్ దే’, తమిళంలో ‘ఎన్జీకే’ సినిమాలు చేస్తున్న రకుల్, తాజాగా నాగార్జునతో కలిసి ‘మన్మధుడు-2’ చేయబోతోంది. నిజంగానే తెలుగుపై మమకారమో, లేక ఇక్కడా తన స్థానాన్ని పదిలపర్చుకోడానికి హీరోలను ఎత్తేస్తుందో తెలీదుగానీ, టాలీవుడ్కు ఆమాత్రం ప్రయారిటీ ఇవ్వడం గ్రేటే.

 

తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ రేంజ్కి ఎదిగిపోయిన రకుల్ప్రీంత్ సింగ్, మరోవైపున హిందీలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతుంది. అయితే తమిళ, హిందీ భాషల్లో ఎన్ని మంచి అవకాశాలు వచ్చినా -తెలుగు పరిశ్రమతో తన అనుబంధం మర్చిపోలేనిదని అంటోంది మరి ఈ మాటలు అందరికీ బాగానే అర్ధం అవుతున్నాయిగా  మళ్ళీ టాలీవుడ్లో పాగా వేయడానికి రకుల్ వేస్తున్న బిస్కట్లు ఎంతవరకూ పనిచేస్తాయో చూడాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: