మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా చిత్రలహరి. కళ్యాణి ప్రియదర్శి, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి.


శనివారం ఉగాది సందర్భంగా చిత్రలహరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఆ వేడుకకు చీఫ్ గెస్టులుగా క్రేజీ డైరక్టర్స్ కొరటాల శివ, సుకుమార్ అటెండ్ అయ్యారు. ఇక మైక్ అందుకున్న తేజ్ ఇన్ని ఫ్లాపులు వచ్చినా తనని ఇంతగా ఆదరిస్తున్న మెగా ఫ్యాన్స్ కు తన కృతజ్ఞతలు తెలిపాడు. ఫ్లాపులున్నా మీరు నా వెంట ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. 


సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి చెబుతూ వాళ్లంతా బాగా కష్టపడ్డారని అన్నారు తేజ్. ఇక మాటల సందర్భంలో తనని తేజ్ బాబు అని ఎవరో పిలిచారని తనకు అలా బాబు అని పిలిపించుకోవాలని లేదని.. జస్ట్ తేజూ అని పిలిస్తే చాలని అన్నారు. సాధారణంగా స్టార్ ఇమేజ్ వచ్చిన ప్రతి ఒక్కరిని బాబు అంటుంటారు. కాని నేను బాబుని కాదు అంటున్నాడు మన సుప్రీం హీరో. కొరటాల శివ గారు తేజూ అని పిలిచారు. అలా పిలిస్తే తన సొంత మనిషి పిలిచినట్టు ఉంటుందని. దయచేసి తనని బాబుని చేయొద్దని అన్నారు తేజ్. 


తాను ఈ పొజిషన్ లో ఉండటానికి ముగ్గురు మామయ్యలు కారణమని.. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్థావిస్తూ ఆయన గురించి ఎక్కువ మాట్లాడితే దిష్టి తగులుతుందని అన్నారు సాయి తేజ్.  చిత్రలహరి సినిమాలో సునీల్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజి వంటి కమెడియన్స్ కూడా ఉన్నారు. ఏప్రిల్ 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: