టాలీవుడ్ లో కొత్త దర్శకుడు సందీప్ వంగా, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సూపర్ హిట్ అయ్యింది. మొదట ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు..అంతే కాదు ఈ సినిమా ట్రైలర్ చూసి ఇందులో బోల్డ్ కంటెంట్ ఉందని చాలా మంది విమర్శించారు. ఇక లిప్ లాక్ పోస్టర్ పై కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి హనుమంతరావు లాంటి వారు రచ్చ చేశారు. అలాంటిది ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఒకటీ రెండు రోజులు బోల్డ్ కంటెంట్ అని చెప్పుకున్నా తర్వాత యూత్ కి బాగా కనెక్ట్ కావడంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది.
. ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ చేసిన పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నారు. కియారా అడ్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. హిందీ వర్షన్ లో కూడా సందీప్ వంగా నే దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ‘కబీర్ సింగ్’ టైటిల్ రూపొందుతున్న ఈ మూవీ టీజర్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
అయితే బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి డోస్ కాస్త ఎక్కువగానే పెంచినట్లు కనిపిస్తుంది..అర్జున్ రెడ్డి పోస్టర్ లో విజయ్ దేవరకొండ ఒక్క సిగరేట్ కాలుస్తుంటే..కబీర్ సింగ్ లో రెండు సిగరేట్స్ ఉండటం చూస్తుంటే..ఈ సినిమా బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టుగా తీస్తున్నట్లు అర్థమవుతుంది. 'కబీర్ సింగ్' టీజర్ ను ఏప్రిల్ 8 న రిలీజ్ చేస్తామని పోస్టర్లో తెలిపారు. టీ సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని, క్రిషన్ కుమార్, అశ్విన్ వర్దే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 2019 జూన్ 21న మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తమిళంలో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్నాడు