మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్, రెజినా కసండ్రా ప్రేమించుకున్నారన్న వార్త అప్పట్లో హాట్ న్యూస్ గా మారింది. రెజినాను పెళ్లి చేసుకోవాలని తేజ్ ట్రై చేసినట్టు వార్తలు వచ్చాయి. తేజ్ మొదటి సినిమా పిల్లా నువ్వు లేని జీవితంలో హీరోయిన్ గా నటించింది రెజినా. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో కూడా ఈ ఇద్దరి పెయిర్ సూపర్ హిట్ అందుకుంది.


అందుకే ఇద్దరి మధ్య రిలేషన్ అంట కట్టారు. ఇదిలాఉంటే తేజూ, రెజినాల మధ్య రూమర్స్ పై తాజాగా సాయి తేజ్ స్పందించడం జరిగింది. రెజినా తనకు మంచి స్నేహితురాలు మాత్రమే ఆమె కెరియర్ పాడవకూడదనే తనతో నటించడం లేదని అన్నారు. ఇక రెజినా కూడా ఈ విషయంపై స్పందించింది.


తనని ఎవరితో ప్రేమలో పడలేదని. అలా చేస్తే తప్పకుండా మీ అందరికి చెబుతా అంటుంది రెజినా. నేను ప్రస్తుతం ప్రేమలో ఉన్నా అంటే అది కేవలం నా వృత్తిని మాత్రమే అంటూ రెజినా కామెంట్స్ చేసింది. అయితే తేజూ, రెజినాల మీద ఈ రేంజ్ లో రూమర్స్ రావడానికి ఓ షోలో రెజినాని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నా అని సాయి తేజ్ అన్న మాటలే కారణమని అంటున్నారు.


మొత్తానికి ఇద్దరి దగ్గర నుండి క్లియర్ కట్ గా వారి ప్రేమ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈమధ్య తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైన రెజినా తమిళంలో వరుస సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ లో కూడా ఈమధ్యనే ఏక్‌ లడ్కీ కో దేఖాతో ఐసా లగా సినిమాలో నటించి అలరించింది.   


మరింత సమాచారం తెలుసుకోండి: