బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాకు ఆదిలోనే హంసపాదు ఎదురైనట్టుగా అని ఆటంకాలే జరుగుతున్నాయి. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్ పూణెలో ప్లాన్ చేశారు.


అయితే ఆ షెడ్యూల్ జరుగకుండానే సినిమాకు బ్రేక్ ఇచ్చారు. జిమ్ వర్క్ అవుట్స్ చేస్తున్న రాం చరణ్ కు యానిల్ కు గాయమవడంతో సినిమా షూటింగ్ ఆపేశారు. అదే కాకుండా సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన నటించాల్సిన బ్రిటన్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ కూడా సినిమా నుండి క్విట్ అయ్యింది.


ఈ రెండు షాకులతో రాజమౌళికి తలనొప్పి తెప్పించాయట. కెరియర్ లో ఎప్పుడూ లేనిది రిలీజ్ డేట్ కూడా ముందే ప్రకటించిన జక్కన్న ఆ టైంకు సినిమా తీసుకురావాలంటే అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి అనుకోకుండా చరణ్ కు గాయమవడం.. హీరోయిన్ హ్యాండ్ ఇవ్వడం సినిమా షూటింగ్ కు అంతరాయం కలిగిస్తున్నాయి.


డైసీ ప్లేస్ లో ఇప్పుడు మరో హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టాడు రాజమౌళి. తెలుస్తున్న సమాచారం ప్రకారం జాన్వి కపూర్ లేదా శ్రద్ధా కపూర్ ఈ ఛాన్స్ అందుకునే అవకాశం ఉందట. శ్రద్ధా కపూర్ ఆల్రెడీ సాహో సినిమాలో ప్రభాస్ తో జోడీ కడుతుంది. ఆర్.ఆర్.ఆర్ సెకండ్ హీరోయిన్ పై త్వరలోనే ఓ క్లారిటీ వస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: