ఈ మద్య టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో ఒకప్పటి టాప్ హీరోలు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి విలన్లుగా నటిస్తున్నారు. తెలుగు లో రొమాంటిక్ హీరో జగపతి బాబు ఇప్పుడు విలన్ గా బిజీ బిజీగా ఉన్నారు.  తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో యాక్షన్ సినిమాల్లో నటించిన యాక్షన్ హీరో అర్జున్ సైతం విలన్ గా నటిస్తున్నారు.  ప్రస్తుతం ఈ కోవలోకే వస్తున్నాడు ప్రముఖ దర్శకులు సూర్య.  ఒకప్పుడు పవన్ కళ్యాన్ తో ‘ఖుషి’లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన సూర్య ఆ తర్వాత కొమురం పులి సినిమాతో నిరాశపరిచాడు. 

తెలుగు, తమిళ టాప్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు తీయడమే కాదు..తాను కూడా హీరోగా పలు సినిమాల్లో నటించారు.  ఆ మద్య స్పైడర్, మెర్సల్ లాంటి సినిమాల్లో విలన్ గా కనిపించి మెప్పించాడు సూర్య.   సినీ పరిశ్రమలో మనకు అనుకూలంగా ఏవీ రావని వాటిని మనమే సెట్ చేసుకోవాలని అంటారు సూర్య.  ఒకప్పుడు డైరెక్టర్ గా బిజీ..సినిమాలు తగ్గడంతో ఇప్పుడు విలన్ పాత్రల్లో నటిస్తున్నాను..నటనకు ప్రాధాన్య ఉన్న ఏ పాత్ర అయినా చేస్తానని అంటున్నారు. 

ప్రస్తుతం రజనీతో తాను చేస్తోన్న సినిమాలో ఎస్.జె.సూర్యకి మళ్లీ ప్రతినాయకుడిగా దర్శకుడు మురుగదాస్ అవకాశం ఇచ్చాడు.  ఇదో మంచి అవకాశం అనుకుంటున్న సంమయంలోనే ఎస్.జె. సూర్య, అజిత్ తాజా మూవీ నుంచి ఆయనకి ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలోనూ ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగానే కనిపించనున్నాడు. మొత్తానికి ఈ స్టార్ డైరెక్టర్ విలన్ గా ఫుల్ బిజీ అయ్యాడన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: