సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమగా వస్తున్న మహర్షి సినిమా మే 9న రిలీజ్ ప్లాన్ చేశారు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు అల్ల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతుంది.


ముఖ్యంగా ఓవర్సీస్ లో మహేష్ స్టామినా గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన పనిలేదు. మహేష్ సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినా సరే యూఎస్ లో మిలియన్ మార్క్ అందుకున్న సినిమాలు ఉన్నాయి. అయితే ఈమధ్య ఓవర్సీస్ లో తెలుగు సినిమాల సందడి అంతగా లేదు. అందుకే మహర్షి సినిమా నిర్మాతలు 16 కోట్ల దాకా కోట్ చేయగా ఫైనల్ గా 12.5 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నారు.


గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ వారు మహర్షి సినిమాను 12.5 కోట్లకు కొనేశారని తెలుస్తుంది. మహర్షి సూపర్ హిట్ అయితే తప్ప ఈ మొత్తం రికవర్ అవ్వదు. సినిమాపై నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. తప్పకుండా ఇది అందరిని టచ్ చేసే సినిమా అవుతుందని అంచనాలు పెంచేస్తున్నారు.


భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ చేస్తున్న మహర్షి సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం మరో సంచలనం సృష్టించినట్టే. మహేష్ డిఫరెంట్ స్టైల్స్ లో కనిపిస్తున్న ఈ సినిమా నుండి ఈమధ్య వచ్చిన టీజర్ అదరగొట్టింది. సక్సెస్ అనేది డెస్టినేషన్ కాదు అది జర్నీ లో భాగం అని చెబ్బఓతున్న మహర్షి ఎలా ఉండబోతుందో తెలియాలంటే మే 9 వరకు వెయిట్ చేయాల్సిందే.  



మరింత సమాచారం తెలుసుకోండి: