జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించిన నేపథ్యంలో ఈ సభకు మెగా కుటుంబం నుండి వరుణ్ తేజ్, అల్లు అర్జున్, నాగబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై మెగా హీరోలందరినీ చూసి మురిసిపోయారు మెగా అభిమానులు. దాదాపు చాలా కాలం తర్వాత వీరంతా ఒకే వేదికపై కనపడటంతో అభిమానులు ఎంతగానో సంతోషించారు.
పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ అక్కడి ప్రజా సమస్యల గురించి మరియు 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందో వంటి విషయాలను సామాన్యులకు అర్థమయ్యే రీతిలో ప్రసంగించారు పవన్. ఈ సందర్భంగా వేదికపై అల్లు అర్జున్ కూడా ఉండటంతో మధ్యలో ప్రసంగిస్తారు అని చాలామంది అభిమానులు ఆశపడ్డారు.
అయితే పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ముగించిన వెంటనే వేదిక దిగి వెళ్లి పోవడం తో వెంటనే అల్లు అర్జున్ కూడా పవన్ వెనకాలే వెళ్లిపోయారు. మొత్తంమీద చివరిరోజు పాలకొల్లు నియోజకవర్గం లో పవన్ కళ్యాణ్ పర్యటించడం తో ఆ ప్రాంతంలో ఉన్న మెగా అభిమానులు జనసేన పార్టీ మహా సభకు భారీ ఎత్తున హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు.