వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్ అవడంతో మెగా మేనళ్లుడు సాయి తేజ్ కెరియర్ సందిగ్ధంలో పడ్డది. తిక్క నుండి లాస్ట్ ఇయర్ వచ్చిన తేజ్ ఐలవ్యూ వరకు సాయి ధరం తేజ్ ఫ్లాపులు అతన్ని బాగా డిస్ట్రబ్ చేశాయి. లేటెస్ట్ గా కిశోర్ తిరుమల డైరక్షన్ లో చిత్రలహరి సినిమా చేశాడు సాయి తేజ్. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


ఈ సినిమా ప్రీమియర్స్ నుండి వచ్చిన టాక్ ను బట్టి చూస్తే తేజూ ఈసారి టెస్ట్ పాస్ అయ్యేలా ఉన్నాడని చెప్పొచ్చు. అంతేకాదు సినిమా బిజినెస్ కూడా 13 కోట్లే చేసింది కాబట్టి టాక్ అటు ఇటైనా పెద్దగా నష్టపోయేది ఉండని తెలుస్తుంది. మెగా ఫ్యాన్స్ లో మాస్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సాయి తేజ్ చిత్రలహరి మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు.


నేను శైలజా, ఉన్న్నది ఒకటే జిందగి సినిమాలతో ప్రతిభ చాటుకున్న కిశోర్ తిరుమల చిత్రలహరితో ఇంప్రెస్ చేశాడని అంటున్నారు. కళ్యాణి ప్రియదర్శి, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించిన చిత్రలహరి సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. మెగా ఫ్యాన్స్ తో పాటుగా యూత్ ఆడియెన్స్ కు నచ్చే అంశాలు ఉన్నాయని సినిమా టాక్ ను బట్టి తెలుస్తుంది. 


అంతేకాదు ఈసారి కిశోర్ తిరుమల ఓ మెసేజ్ కూడా సినిమాలో పెట్టాడని తెలుస్తుంది. ప్రొడక్షన్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవని మైత్రి మూవీ మేకర్స్ సినిమాను రిచ్ గా తెరకెక్కించారని తెలుస్తుంది. మరి సాయి తేజ్ చిత్రలహరి ఫైనల్ రిపోర్ట్ ఏంటన్నది మరికొద్దిక్షణాల్లో తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: